కాంతారా సినిమా అభిమానులకు శుభవార్త...!!

murali krishna
ప్రస్తుతం కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు పడిన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఈ సమయంలో అందరిని అలరించే విధంగా వచ్చిన సినిమా కాంతారా ఇండియన్ సినిమా గా వచ్చి అద్భుత విజయం సాధించిన ల్లో కాంతార కూడా ఒకటి . కన్నడ లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విజయం అందుకుంది. ముందుగా కన్నడలో విడుదలైన కాంతార అక్కడ భారీ హిట్ గా నిలవడంతో పలు భాషల్లోకి కూడా డబ్ అయ్యి అద్భుత విజయాన్ని సొంతం.
సుమారు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450కోట్లకు పైగా నే వసూల్ చేసిందని సమాచారం.. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన కూడా ప్రేక్షకులను ఎంతో విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున అయితే కూర్చోపెడుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని కూడా గతకొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే తాజాగా హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ యాజమాన్యం కూడా మాట్లాడుతూ.. కాంతార సీక్వెల్ పై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మాకు కాంతార సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ ని ఇస్తాం. ప్రస్తుతం రిషబ్ శెట్టి కొంత విరామం తీసుకున్నాడు. త్వరలోనే అతను తిరిగి రాగానే కాంతార సీక్వెల్ గురించి మేము చర్చిస్తాం అని అన్నారు. దాంతో కాంతార మూవీ ఫ్యాన్స్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కన్నడిగులు యొక్క సంప్రదాయమైన భూతకోల ఆధారంగా తెరకెక్కిన కాంతార ను రిషబ్ శెట్టినే దర్శకత్వం వహించి నటించారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన వేరే లెవల్ అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: