శంకర్ - రామ్ చరణ్ మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్..పక్కా యాక్షన్..!
కానీ తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు రావడం గమనార్హం.#RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను షూట్ చేయడానికి చారిత్రాత్మక కట్టడమైన కొండారెడ్డి బురుజు దగ్గర ఈ సినిమా షూటింగ్ చేయబోతున్నారు . కర్నూలులో కొండారెడ్డి బురుజు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని యాక్షన్ ఫిలిమ్స్ లో ఈ కొండారెడ్డి బురుజును ప్రత్యేకంగా చూపిస్తారు. ఈ క్రమంలోని రామ్ చరణ్ కూడా కొండారెడ్డి బురుజు దగ్గర షూటింగ్ నిర్వహించబోతుండడంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేషాలు కూడా ఉన్నాయి అని అర్థమవుతోంది
ఇందులో రామ్ చరణ్ డ్యుయల్ పాత్ర పోషించనున్నారు. ఒకరు రాజకీయ నేతకాక మరొకరు ప్రభుత్వ అధికారి పాత్ర పోషించనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాతో హీరోయిన్ గా కియారా అద్వానీ మళ్ళీ తెలుగులో అరంగేట్రం చేసింది. అంతేకాదు దిల్ రాజు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకాస్త అంచనాలు పెరగాలి అంటే ఈ సినిమా నుంచి అప్డేట్ రావాల్సిందే. మరి ఏ రేంజ్ లో శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ హిట్ అవుతుందో చూడాలి.