బాలయ్య షో లో పవన్ కళ్యాణ్, జగన్..అందుకేనా..!?

Anilkumar
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి పాపులారిటీని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే గత సీజన్లో ఈ షోలో కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉంది.కానీ  ఈసారి మాత్రం పొలిటికల్ లీడర్స్ని కూడా ఈ షో కి ఆహ్వానిస్తున్నారు బాలయ్య.అయితే  సీజన్ మొదట ఈ  షోలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ ఈ షో లో సందడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దాని వీరిద్దరూ వచ్చిన  అనంతరం మరో ఎపిసోడ్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి బాలయ్య షోకి రావడం జరిగింది. 

అయితే ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ రానున్నారు అని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇక  ఈ షో లో భాగంగా 2014లో ఏ విధమైన పదవి ఆశించకుండా టీడీపీకి  మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ముందుగా బాలయ్య కృతజ్ఞతలు చెప్పాడని తెలుస్తుంది.అంతేకాదు దానితో పాటు బాలయ్య పవన్ ని  2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడని అడగనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ షో లో బాలయ్య చిరంజీవితో కూడా మాట్లాడనున్నట్లుగా సమాచారం.అయితే ఈ షో కి  పవన్ ఒక్కడే కాకుండా ఆయనతో  పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా రానున్నట్లుగా తెలుస్తోంది.

అయితే  జగన్ రాజకీయాలలోకి రాకముందు బాలయ్యకి పెద్ద ఫ్యాన్ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు అప్పట్లో ఆయన సినిమా విడుదలైతే చాలు   జగన్  బాలయ్య కోసం పెద్ద ఎత్తున కటౌట్స్ కూడా ఏర్పాటు చేసేవాడు.ఇటీవల  కృష్ణ గారు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయం లో ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకోవడానికి జగన్ వచ్చినప్పుడు బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు కూడా. ఇక అలా వారిద్దరి మధ్య ఉన్న సాహిత్యం ఇప్పటికీ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి జగన్  ని కూడా బాలయ్య తీసుకొస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే  ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ మరియు జగన్ ని కూర్చోబెట్టి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలను బాలయ్య ఈ నేపథ్యంలో వారిద్దరిని అడగనున్నట్లుగా తెలుస్తుంది.వీరిద్దరూ బలయ్య షో కి రావడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: