చిరంజీవి "వాల్తేరు వీరయ్య" రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ తో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి , బాబి దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు బాబి వాల్తేరు వీరయ్య మూవీ ని పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

శృతి హాసన్ ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం బాస్ పార్టీ ,  శ్రీదేవి ... చిరంజీవి అనే రెండు పాటలను విడుదల చేసింది. ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2 గంటల 35 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: