"ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" మూవీ అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో మూవీ లలో హీరో గా మరియు ఇతర ముఖ్య పాత్రలలో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే తాజాగా అల్లరి నరేష్ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటించగా ,  ఏ ఆర్ మోహన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ లో కలెక్షన్ లు లభించాయి.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను జీ 5  "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. తాజాగా జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ వారు ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు ఆలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: