భార్యకి విడాకులు? క్లారిటీ ఇచ్చిన నిఖిల్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్  ఇక రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ సినిమాతో బిజీగా ఉన్నాడు.అయితే గతంలో కరోనా సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి.. పల్లవి వర్మ అనే డాక్టర్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే  హీరో నిఖిల్ విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ కొన్ని రోజుల క్రితం కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి.తాజాగా 18 పేజెస్ సినిమా ప్రమోషన్స్ లో  పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న నిఖిల్ ఈ విషయం మీద స్పందించడం జరిగింది.ఇక తాను విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయారని ఈ సందర్భంగా నిఖిల్ పేర్కొన్నారు. ఆ వార్తలు చూసి చాలా స్టుపిడ్ గా అనిపించిందని వాటిని చూసి చాలా నవ్వుకున్నానని పేర్కొన్నారు. ఇంకా అలాగే తాను తన భార్య పల్లవి చాలా హ్యాపీగా ఉన్నామని ఇలా విడాకుల వార్తలు వస్తున్నాయని తన భార్యతో చెప్పగా ఆమె రియాక్షన్ మాత్రం తనకి షాక్ ఇచ్చిందని నిఖిల్ అన్నారు.మనం కలిసే ఉన్నాము అని ఈ ఫేక్ వార్తలకు చెక్ పెట్టే విధంగా కలిసి ఇద్దరం ఒక ఫోటో పెడదామా అని అడిగితే .. మనం మనకు తెలియదా ఈ ఫేక్ వార్తలకు  ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని తనకే ఎదురు సమాధానం చెప్పిందని అది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని నిఖిల్ అన్నారు.

ఇంకా ఇలాంటి ఫేక్  రూమర్స్ చాలా ఫన్నీగా ఉంటాయని నిఖిల్ అభిప్రాయపడ్డారు.నిజానికి ట్రోల్స్ మీమ్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తానని వాటిని చాలా ఫన్నీగా తీసుకుంటానని అన్నారు.ఇక ఇటువంటి వార్తలు రాసే సమయంలో మీడియా వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఇంకా కాస్త రియాలిటీ చెక్ చేసుకుని ఉంటే బాగుంటుందని లేకపోతే అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్  అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మీమర్స్ విషయంలో వాళ్ల మీద ఎన్నో ప్రశంసలను కురిపించిన నిఖిల్ యూట్యూబ్ వీడియోలు మీద మాత్రం చాలా ఘాటుగా స్పందించారు. వీడియో ఒకటి ఉంటే దాని థంబ్ నైల్ అనేది మరో రకంగా పెడుతున్నారని లోపలికి వెళితే అందులో కంటెంట్ అసలు  ఉండడం లేదని ఆయన అన్నారు. ఆ వీడియోలు కూడా ఎంతో దారుణంగా ఉంటున్నాయని నిఖిల్ అన్నారు. అందుకే ఈ విషయంపై ఖచ్చితంగా ఎవరైనా యాక్షన్ తీసుకోవాలని లేదా యూట్యూబ్ కు సెన్సార్ అయినా ఉండాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: