మరోసారి భయపడుతున్న దిల్ రాజు.. కారణం..?

Divya
ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన దిల్ రాజు.. ఆ తర్వాత అంచలంచేలుగా ఎదుగుతూ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా తమ ప్రొడక్షన్ సంస్థను విస్తరింప చేయడానికి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దళపతితో తెలుగు , తమిళ్ బైలింగ్వల్ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్నారు.

అయితే గత కొద్దిరోజుల నుంచి సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న తెలుగు సినిమాల కంటే తమిళ్ సినిమాకి ఎక్కువ థియేటర్ లు  ఇస్తున్నారని తెలిసి పెద్ద వివాదమే జరిగింది . మరొక పక్క తమిళనాడులో ఎనిమిది వందల థియేటర్ లు ఉండగా అజిత్ సినిమాకి 400 థియేటర్లు , విజయ్ సినిమాకి 400 థియేటర్లు కేటాయించాల్సి ఉంది. కానీ దిల్ రాజు నోరు జారి అజిత్ కంటే విజయ్ స్టార్ హీరో అందుకే ఇంకో 50 థియేటర్లు ఎక్కువగా కావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అడుగుదామని అనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో తమిళ్, తంబీల ఆగ్రహానికి గురైయ్యాడు దిల్ రాజు..దీంతో ఎక్కడ చూసినా ఈయనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు తమిళ్ తంబీలు.
అయితే ఈ ట్రోలింగ్ ను  తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.." మీడియా ముందు మాట్లాడాలంటే భయంగా ఉంది. 45 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో.. 20 సెకండ్ల వీడియో క్లిప్పింగ్ ఆధారంగా వివాదం సృష్టించకండి. నేను ఎవరిని పొగడలేదు.. అలాగని కించపరచలేదు.. అన్ని మంచి సినిమాలకు సపోర్టు చేస్తాను" అంటూ వెల్లడించారు . ఇకపోతే ఉదయనిది స్టాలిన్ తమిళనాడులోని నాలుగు ప్రధాన ప్రాంతాలలో విజయ్ వరిసు సినిమాను రిలీజ్ చేసుకోవడానికి థియేటర్లు కేటాయించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: