ముగ్గురు నందమూరి హీరోలు ఒకే స్టేజిపై..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నా బాలకృష్ణ ఈ మూవీ తో పాటు అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే ఈ టాప్ షో కు సంబంధించిన మొదటి సీజన్ పూర్తి అయ్యింది. కెరియర్ లో మొట్ట మొదటి సారి అన్ స్టాపబుల్ టాక్ షో కు హోస్ట్ గా వివరించడం బాలకృష్ణ తన వాక్ చాతుర్యంతో  , తన డైలాగ్ డెలివరీతో అన్ స్టాపబుల్ సీజన్ 1 ను సూపర్ హిట్ చేశాడు. ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది.

ప్రస్తుతం ఈ సీజన్ 2 కి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ టాక్ షో కు రెబల్ స్టార్ ప్రభాస్ మరియు మ్యాచో హీరో గోపీచంద్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఎపిసోడ్ ను మరి కొన్ని రోజుల్లో ఆహా "ఓ టి టి" స్ట్రీమింగ్ చేయబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ టాక్ షో కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు కూడా ఒక ఎపిసోడ్ కు గెస్ట్ లుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కనుక ఈ ఎపిసోడ్ కు వచ్చినట్లు అయితే ముగ్గురు నందమూరి హీరోలు ఒకే స్టేజిపై కనబడినట్టు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: