అభిమానులతో విజయ్ భేటీ.. అందుకేనా?

Purushottham Vinay
 తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి పరిచయం  అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన హీరో. విజయ్ నటించిన సినిమాలు కూడా కొన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అందువల్ల టాలీవుడ్ ప్రేక్షకులు కూడా విజయ్ కి అభిమానులుగా మారిపోవడం జరిగింది.ఇక ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం వారీసు సినిమా పనులతో చాలా బిజీగా ఉన్నాడు.విజయ్ తెలుగులో నటిస్తున్న ఫస్ట్ సినిమా ఇది.ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమాని తెలుగు ఇంకా తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. అయితే మరొక తమిళ స్టార్ హీరో  అయిన అజిత్ నటించిన ' తునివు ' సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల మధ్య చాలా పెద్ద గట్టి పోటీ నెలకొననుంది.దీంతో ఈ ఇద్దరి హీరోల అభిమానులు మధ్య వివాదాలు తలెత్తయి. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి రిలీజ్ కానుండటంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో తాజాగా విజయ్ చెన్నైలోని పనైయుర్ లో ఉన్న తన ఆఫీస్ లో అభిమానులతో భేటీ అయ్యాడు. ఇటీవల కూడా ముక్తల్ ఇరుక్కం నిర్వాహకులతో విజయ్ సమావేశమవ్వడం జరిగింది. ఇక తాజాగా అరియాలూర్ ఇంకా పెరంబలూర్ జిల్లాలకు చెందిన అభిమానులతో కూడా సమావేశం అయ్యాడు. ఈ సమావేశంలో అభిమానుల మధ్య జరుగుతున్న వివాదం గురించి విజయ్ చర్చించడం జరిగింది.ఇంకా అంతే కాకుండా వారీసు సినిమా విడుదల తేదీ ఇంకా అలాగే ఇతర విషయాల గురించి కూడా సుధీర్ఘంగా అభిమానులతో చర్చించాడు. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించిన వీడియో ఇంకా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో తమ అభిమాన హీరోని కలుసుకున్న అభిమానులు బాగా కేకలు వేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వారిసు సినిమా పై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక విజయ్ మొదటిసారిగా తెలుగులో నటిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ఆయన అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: