దానివల్లే సాయి పల్లవి సినీ జీవితం ముగిసిందా..?

Divya
మొదట్లో ఢీ జూనియర్ డాన్స్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి పాపులారిటీని దక్కించుకున్న సాయి పల్లవి.. మొదటి సారి హీరోయిన్ గా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమా ద్వారా పరిచయమయ్యింది. మరి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలలో చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. ఈ క్రమం లోనే ఈమెకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా అందించారు అభిమానులు. ఇటీవల కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈమె ప్రస్తుతం నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి.
ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.  అయితే సాయి పల్లవి సినిమా జీవితం ఉన్నట్టుండి ముగియడానికి కారణం ఈమె కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అన్నట్టుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. కశ్మీర్ ఫైల్స్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే ఆమె కనపడకుండా పోయింది అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. నిజం చెప్పాలి అంటే ప్రస్తుతం రెండు పెద్ద తమిళ ప్రాజెక్టులలో మాత్రమే సాయి పల్లవి నటిస్తోంది. కానీ ఇప్పటివరకు తెలుగులో ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం.

కాశ్మీర్ ఫైల్స్ సినిమా వల్లే సాయి పల్లవికి అవకాశాలు రావడం లేదు అంటూ కూడా కొంతమంది నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈమైతే తెలుగులో ఒక సినిమాలో కూడా నటించకపోవడం పలు సంచలనాలకు దారితీస్తోంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో కోయంబత్తూర్లో సొంతంగా హాస్పిటల్ నిర్మించి పేదలకు ఉచిత వైద్య అందివ్వడానికి సిద్ధమయ్యింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఇందులో ఎంత నిజం ఏది నిజం ఉందో తెలియాలి అంటే సాయి పల్లవి వీటిపై స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: