మహేష్ 28వ మూవీలో ఆ బాలీవుడ్ హీరోయిన్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు  ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే , మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథ ప్రకారం ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు మహేష్ బాబు సరసన నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా శ్రీ లీల మహేష్ బాబు సరసన రెండవ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది అని , ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ ను చిత్ర బృందం  ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసింది అని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ కు ఇది వరకే అనేక తెలుగు మూవీల నుండి అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఏ తెలుగు మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: