ఆ రీమేక్ మూవీ పై కన్ను వేసిన టాలీవుడ్ కింగ్ నాగార్జున..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ సీనియర్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం నాగార్జున బంగార్రాజు ,  బ్రహ్మాస్త్ర , ది ఘోస్ట్ మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు.  బంగార్రాజు మూవీ లో నాగార్జున అక్కినేని నాగ చైతన్య తో పాటు హీరోగా నటించాడు .ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ మూవీ కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.  బ్రహ్మాస్త్ర అనే హిందీ మూవీ లో  నాగార్జున చిన్న గెస్ట్ రోల్ లో న. ఈ మూవీ ద్వారా నాగార్జున కు దేశ వ్యాప్తంగా మంచి ప్రశంసలు లభించాయి. బ్రహ్మాస్త్రం మూవీలో రన్బీర్ కపూర్ హీరోగా నటించిన అలియా భట్ హీరోయిన్ గా నటించింది.  ది ఘోస్ట్ మూవీ లో నాగార్జున సోలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే నాగార్జున ప్రస్తుతం ఒక రీమేక్ మూవీ పై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... మలయాళం లో సూపర్ హిట్ విజయం అందుకున్న పోరింజు మరియు జోష్ అనే మూవీ ని అనే మూవీ ని తెలుగు లో నాగార్జున రీమిక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన అనేక వివరాలు మరి కొన్ని రోజుల్లోనే బయటికి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా నాగార్జున ప్రస్తుతం ఒక రీమేక్ మూవీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: