మౌనం వీడనున్న దిల్ రాజ్ !

Seetha Sailaja
ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ వివాదాలకు దూరంగా ఉంటాడు. టాప్ హీరోలు అందరితోను సన్నిహితంగా ఉండే దిల్ రాజ్ ను కార్నర్ చేస్తూ ఈమధ్య నెగిటివ్ కామెంట్స్ చాలామంది ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. అయితే ఆ కామెంట్స్ పై ఇప్పటివరకు దిల్ రాజ్ ఎలాంటి స్పందన లేకపోవడంతో దిల్ రాజ్ కు ఏమైంది అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పుడు త్వరలో దిల్ రాజ్ తన పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి సరైన సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి దిల్ రాజ్ స్వయంగా మీడియాకు లీకులు ఇస్తున్నాడు. లేటెస్ట్ గా దిల్ రాజ్ విడుదలచేసిన ‘మసూద’ సక్సస్ మీట్ లో దిల్ రాజ్ మాట్లాడుతూ తన పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం పై స్పందించాడు.

జులైలో తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన ‘థాంక్యూ’ సినిమా కోసం ‘కార్తికేయ 2’ చిత్రాన్ని వాయిదా వేయించాడు అంటూ దిల్ రాజ్ పై నెగిటివ్ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో తన తప్పేమీ లేదని చెప్పుకోవడానికి దిల్ రాజ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’ గా డబ్ చేసి సంక్రాంతి రేస్ లో విడుదల చేస్తున్నారు. ఇలా దిల్ రాజ్ చేయడం వల్ల సంక్రాంతి సినిమాలకు కష్టంగా మారింది అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై త్వరలో తాను స్పదించబోతున్నట్లు దిల్ రాజ్ తెలియచేసాడు.

త్వరలోనే ‘వారసుడు’ థియేటర్ల ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు దిల్ రాజ్ వెల్లడించాడు. ప్రతి విషయంలోనూ తనను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, తనలో రెండో కోణం ఉందని మంచి సినిమాల కోసం తాను నష్టపోవడానికి కూడ సిద్ధం అంటూ తనకు ప్రస్తుతం డబ్బు సంపాదన కంటే ప్రేక్షకులకు మంచి సినిమాలు చూపెట్టాలి అన్న తపన తనలో పెరిగిపోతోంది అంటూ కామెంట్ చేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: