వారసుడు సినిమాకు మరో షాక్..
ఇదిలా ఉంటే ఈ సినిమాను వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు తమిళ్ నా లేక తెలుగు నా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ విషయం పై ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందిస్తూ ఈ మూవీ తమిళ్ అని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. అయితే సంక్రాంతి సమయంలో డబ్బింగ్ లకు ప్రధాన్యత ఇవ్వకూడదని నిర్మాతల మండలి కూడా ప్రకటించడంతో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఈ చిత్రమ్లో అనుమతి లేకుండా ఏనుగులను ఉపయోగించారని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు నిర్మాత దిల్ రాజుకు నోటీసులు పంపించారు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్రకారం ఏనుగులకు రక్షణ కల్పిస్తూ చట్టం ఉంది. దీని ప్రకారమే వారీసు చిత్ర నిర్మాత దిల్ రాజుకు నోటీసులు పంపించారు, దీని పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా విజయ్ సినిమాకు ఇలాంటి అడ్డంకి రావడం ఆయన ఫ్యాన్స్ నిరాశ లో ఉన్నారు.