ఆ విషయంలో అల్లు అర్జున్ కంటే ఎన్టీఆరే తోపా..!

Divya
అటు అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ .. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్.. ఇద్దరూ కూడా ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోతే.. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రస్తుతం వీరిద్దరూ కూడా తమ తదుపరి చిత్రాలపై ఫోకస్ పెడుతూనే.. మరొకవైపు పలు ఫుడ్ ఏజెన్సీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు వ్యవహరిస్తున్న ఫుడ్ డెలివరీ యాడ్ షూట్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే గతంలో అల్లు అర్జున్ జొమాటో ఫుడ్ డెలివరీ ఆప్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా లిషీయస్ ఫుడ్ ఆర్గనైజేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.  ఇటీవలే ఈ యాడ్ కు సంబంధించి ఎన్టీఆర్ లుక్ బయటకి రాగా .. అందరూ కూడా ఆ లుక్ చూసి సినిమా కోసం అనుకున్నారు.. కానీ యాడ్ అని తెలిసి మరింత సంబరపడిపోతున్నారు.  తాజాగా ఈ యాడ్ నిన్న విడుదల అవ్వగా ఊహించని రేంజ్ లో వ్యూస్, లైక్స్ సొంతం చేసుకోవడం గమనార్హం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ట్విట్టర్ అధికారిక ఖాతాలో జొమాటో కోసం అల్లు అర్జున్ చేసిన ప్రకటన కంటే..  ఎన్టీఆర్  కొత్త యాడ్ ఎక్కువ లైక్‌లను పొందింది.  నిజానికి జోమాటో..  లిషీయస్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న విషయం తెలిసిందే. కానీ అల్లు అర్జున్ కంటే ఎన్టీఆర్ నటించిన యాడ్ కే ఎక్కువ లైక్ లు రావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ కంటే ఎన్టీఆర్ కి  ఎక్కువ ఫాలోయింగ్ ఉందని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా ఇద్దరూ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి మరింత పాపులారిటీని దక్కించుకున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: