ప్రభాస్... మారుతి మూవీకి ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ ఇప్పటికే ఈ సంవత్సరం రాదే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి రాధా కృష్ణ దర్శకత్వం వహించగా  పూజా హెగ్డే ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో రూపొందించబడిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయ్యింది.

భారీ ఎత్తున , భారీ అంతనాల నడుమ విడుదల అయిన రాదే శ్యామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు హీరోయిన్ లను ఈ మూవీ యూనిట్ ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఈ మూవీ లో ఇప్పటికే నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లను మూవీ యూనిట్ ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్టు , ఈ మూవీ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందనునట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ...  ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగుతున్న ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి మ్యూజిక్ కు అందించబోతున్నట్లు , అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ప్రస్తుతం ఒక మాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: