వాల్తేరు వీరయ్య సెట్స్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో శృతి హాసన్ , మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , బాబీ సింహ ఈ మూవీ లో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
 

ఈ మూవీ ని  సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. అలాగే ఈ మూవీ ప్రమోషన్ లను కూడా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ మూవీ నుండి బాస్ పార్టీ సాంగ్ ను ఈ రోజు విడుదల చేయనున్నారు. అలాగే ఈ సాంగ్ ప్రోమో ను నిన్ననే ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. బాస్ పార్టీ సాంగ్ ప్రోమో కు ప్రేక్షకుల నుండి  మంచి ఆదరణ లభించింది. బాస్ పార్టీ ప్రోమో సాంగ్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు ప్రస్తుతం ఈ ఫుల్ సాంగ్ కోసం మంచి అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
 

ఇది ఇలా ఉంటే తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు బయటకు విడుదల అయ్యాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు బాబి మరియు పలువురు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే దర్శకుడు బాబి దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: