త్రిష తొలి తెలుగు వెబ్ సిరీస్ నుండి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగిన త్రిష గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ హీరోగా తేరకేక్కిన వర్షం మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దుగుమ్మ వర్షం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు వరస అవకాశాలతో ఫుల్ జోష్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ కెరియర్ ను కొనసాగించింది. ప్రస్తుతం త్రిష తెలుగు కంటే కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లోనే ఎక్కువగా నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తాజాగా గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది.
 

ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయి మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిష "బృందా" అనే తెలుగు వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో త్రిష పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ వెబ్ సిరీస్ కు మ్యూజిక్ ను అందిస్తూ ఉండగా ,  సూర్య వంగల ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు సోనీ లీవ్ ఓటిటి ప్లాట్ఫారంలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: