హాట్ టాపిక్ గా మారిన వంశీ పైడిపల్లి కష్టాలు !

Seetha Sailaja

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకొక్క స్టార్ డైరెక్టర్ కష్టాలు ఒకొక్క విధంగా ఉంటున్నాయి. ‘అల వైకుంట పురములో’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పటివరకు మరొక సినిమాను తీయలేకపోయాడు. ఎట్టకేలకు మహేష్ తో సినిమాను సెట్ చేసుకుంటే ఈమూవీకి సంబంధించి కథ సెట్ కాక కొంతకాలం ఆతరువాత మహేష్ తల్లి చనిపోయిన కారణంతో మరో కొంతకాలం ఆగి చిట్టచివరకు ప్రారంభం అయితే ఇప్పుడు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో ఆషాక్ నుండి తేరుకుని మహేష్ మళ్ళీ ఎప్పుడు సినిమా షూటింగ్ లు మొదలు పెడతాడో తెలియని పరిస్థితి.


ఇక హరీష్ శంకర్ పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకె చేసుకున్నప్పటికీ ఆమూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అతడికే తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈలిస్టులోకి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడ చేరిపోయినట్లు అనిపిస్తుంది. మహేష్ తో ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తరువాత మరొక సినిమాను మహేష్ తోనే తీయాలని ఎన్నోప్రయత్నాలు చేసినప్పటికీ అది కుదరకపోవడంతో సుమారు మూడు సంవత్సరాలు ఖాళీగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.

అయితే దిల్ రాజ్ తో వంశీ పైడిపల్లికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఎట్టకేలకు తమిళ టాప్ హీరో విజయ్ ని ఒప్పించి ‘వారసుడు’ సినిమాను చకచకా పూర్తి చేస్తున్నాడు. ఈసినిమా ప్రారంభ సమయంలో ఈమూవీని ద్విభాషా చిత్రం అంటూ ప్రమోట్ చేసారు. అయితే హీరో విజయ్ మాత్రం ద్విభాషా చిత్రం కాదని తమిళ సినిమా మాత్రమే అనేవిధంగా సంకేతాలు ఇస్తూ ఈమూవీ తెలుగులో డబ్బింగ్ మూవీగా మాత్రమే విడుదల అవుతుంది అని లీక్ లు ఇస్తున్నట్లు టాక్.


ఇప్పుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈమూవీ తెలుగులో డబ్బింగ్ మూవీగా ప్రమోట్ కాబడితే వంశీ పైడిపల్లికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చే ఆస్కారం లేదు. దీనితో హీరో విజయ్ ను ఒప్పించి ‘వారసుడు’ ద్విభాషా చిత్రం అన్న అర్థం వచ్చేలా ఎలా ప్రమోట్ చేయాలి అంటూ వంశీ పైడిపల్లి తెగ మధన పడిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: