మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో వజ్రం వచ్చి చేరింది. ఇక 2022 సంవత్సరానికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా మెగాస్టార్ నిలిచారు.అయితే ఆదివారం గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఇక ఈ సందర్భంగా భారతీయ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన, ప్రభావంతమైన నటుల్లో ఒకరిగా మెగాస్టార్ చిరంజీవి ను కీర్తించింది కేంద్రప్రభుత్వం.కాగా ఈనేపథ్యంలో పలువురు ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలావుండగా తాజాగా ఆయన సోదరుడు పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఈ విషయంపై స్పందించారు.అయితే ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నందుకు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక ‘తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవి గారిని 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022' పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.అయితే గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం.
ఇక ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.ఇకపోతే నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.అయితే అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్యకు ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను’ అని హర్షం వ్యక్తం చేశారు పవన్.ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.ఇక కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.కాగా తనను ఈ స్థాయిలో అదరించి అభిమానించిన ఫ్యాన్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..!!