మహేష్ మూవీ తర్వాత ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్న త్రివిక్రమ్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరియర్ ను కథ రచయితగా మొదలు పెట్టి , కథ రచయితగా ఎంతో సక్సెస్ ను సాధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. కథా రచయితుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ రేంజ్ లో సక్సెస్ ను అందుకున్నాడో , దర్శకుడి గా కూడా అదే రేంజ్ సక్సెస్ ను అందుకున్నాడు. అందులో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి , టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆఖరుగా అల్లు అర్జున్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన అలా వైకుంఠపురంలో మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని , భారీ కలెక్షన్ లను కూడా సాధించింది.

అలా వైకుంటపురంలో మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత మూవీ ని కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు తో మూవీ పూర్తి అయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక భారీ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: