పాపం.. రౌడీ హీరోకు ఎంత కష్టం వచ్చింది?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి ఇక ఊహించని రీతిలో  స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే కెరియర్ మొదట్లో బ్లాక్ బస్టర్ విజయాలను సాధించిన విజయ దేవరకొండ ఇక ఆ తర్వాత మాత్రం అదే మ్యాజిక్  కొనసాగించలేకపోయాడు అని చెప్పాలి. ఇక విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎందుకో సరైన హిట్టు మాత్రం కొట్టలేకపోతున్నాడు. గీతాగోవిందం తర్వాత హిట్ అనే పదాన్నే మరిచిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే ఇటీవలే పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ అనే భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.

 ఏకంగా కామన్ ప్రేక్షకులు మాత్రమే కాదు రౌడీ హీరో అభిమానులు సైతం ఇక లైగర్ సినిమాపై పెదవి విరిచారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న సమంత, రౌడీ హీరో  విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఖుషి అనే సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా హిట్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ ఇటీవలే సమంత ఒక అరుదైన వ్యాధి బారిన పడటంతో షూటింగ్ వాయిదా పడింది. ఇక విజయ్ ప్రస్తుతం ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 ఇప్పటికే హరీష్ శంకర్, గౌతమ్ తిననూరి, శేఖర్ కమ్ముల సహా మరి కొంతమంది దర్శకులు విజయ్ దేవరకొండ తో సినిమా తీసేందుకు క్యూ కట్టారు అన్నది తెలుస్తుంది. ఒక బాలీవుడ్ దర్శకుడు కూడా విజయ్ దేవరకొండ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. దీంతో ఇంతమంది దర్శకులలో మొదట ఎవరితో ప్రాజెక్ట్ చేయాలి అనేది తెలియక నలిగిపోతున్నాడట విజయ్ దేవరకొండ. అందరి దర్శకుల స్టోరీస్ లైన్ నచ్చినప్పటికీ ఎవరితో ముందుగా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నాడంటూ ప్రస్తుతం ఒక టాక్ చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: