పవన్ కళ్యాణ్... సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తనకెక్కిన భీమ్లా నాయక్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూ వీలో దగ్గుపాటి రానా మరో హీరోగా నటించగా , త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ సముద్ర కని దర్శకత్వం లో తమిళ సినిమా అయినటు వంటి వినోదయ సీతం మూవీ ని తెలుగు లో రీమిక్ చేయబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి దరమ్ తేజ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ తమిళ రీమిక్ సినిమాకు సంబంధించిన ఒక కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు , ఈ మూవీ పూర్తి అయిన తర్వాత 2024 ఎలక్షన్ లు ముగిసే వరకు ఏ మూవీ లో కూడా నటించకూడదు అని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు దానితో 2024 ఎలక్షన్ ల తర్వాత వినోదయ సీతం మూవీ రీమేక్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: