"ప్రాజెక్ట్ కే" మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన నాగ్ అశ్విన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ , నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే మూవీ తో దర్శకుడు గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అలాగే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించడంతో మొదటి మూవీ తోనే నాగ్ అశ్విన్ కి మంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తేరకెక్కిన మహానటి మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఈ మూవీ ద్వారా నాగ్ అశ్విన్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఈ మూవీతో నాగ్ అశ్విన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ్ అశ్విన్ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే అనే భారీ బడ్జెట్ ను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ్ అశ్విన్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఆడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఆడియోలో నాకు అశ్విన్ "ప్రాజెక్ట్ కే" మూవీ గురించి చెప్పాడు. కథ చాలా కొత్తది. ఈ మూవీ కోసం ఓ స్పెషల్ ప్రపంచాన్ని కూడా క్రియేట్ చేయాలి. దాని కోసం చాలా సమయం పడుతుంది. ఈ మూవీ లో వినియోగించే వాహనాలను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయవలసిందే అని తాజాగా ప్రాజెక్ట్ కే మూవీ గురించి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: