విజయ్ దేవరకొండ అందరి మెప్పు.. ఏం చేశాడంటే?

P.Nishanth Kumar
ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచా డు విజయ్ దేవరకొండ. తాజాగా ఆయన ఒక హాస్పటల్ వారు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవగా అక్కడ ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారిం ది. అదేమిటంటే ఆయ న అవయవ దానం గురించి మాట్లాడడం ఆయన అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆసక్తిపరుస్తుంది. అవయవదానం అనే దా ని గురించి ఎంతో గొ ప్పగా చెబుతూ తాను కూడా అవయవ దానం చేశానని చెప్పడం ఆయన అభిమానులలో ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది.

నిజంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలలో హీరోలు పాల్గొనడం అనేది చా లా తక్కువగా జరుగుతుంది ఈ తరం సంబంధించిన హీరోలలో దీని ని మొదలుపెట్టింది విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. ఎటువంటి సపోర్ట్ లేకుండా అగ్ర హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన తీసుకురావడం ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతుంది. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాను పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు.

ఆ తరువాత టాలీవుడ్ లో అగ్ర దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ లో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడుతూ ఉండడంతో ఆయన సినిమాలు అన్ని భాషలలో విడుదల అవడానికి సిద్ధమవుతున్నాయి ఆయన గత సినిమా లైగర్ అంతగా ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఇప్పుడు చేయబోయే సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోవాలని చెప్పి ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరి భవిష్యత్తులో ఆయన ఏ స్థాయి హీరోగా ఎదుగుతాడో చూడాలి. ఇటు సినిమాల పరంగా అటు సమాజసేవ పరంగా న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్న ఈ హీరోకి ఆల్ ద బెస్ట్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: