బాలయ్య, చిరు ఓకే రోజు క్లాష్!!

P.Nishanth Kumar
సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో అగ్ర హీరో లైన మెగాస్టార్ చిరంజీవి మరి యు నందమూరి బాలకృష్ణ సినిమాలు విడుదల కాబోతున్నాయి. చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 12వ తేదీన విడు దల చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉండగా ఇటు బాలకృష్ణ కూడా అదే రోజున తన వీర సింహా రెడ్డి సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు ఆ విధంగా ఈ రెం డు సినిమాలు ఒకే సీజన్లో మాత్రమే కాదు ఒకే రోజున పోటీపడుతూ ఉండడం విశేషం.

వాస్తవానికి ఈ రెండు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది అని చెప్పాలి. ఈ ఇద్దరు హీరోలు కూడా భారీ స్థాయిలో అభిమానం కలిగిన హీరోలు కావడం వారి చిత్రాలకు భారీ డిమాండ్ ఉండడం ఈ చిత్రాలకు ఎంతటి స్థాయిలో అంచనాలు పెరిగాయి. దానికి తోడు యువ దర్శకులైన బాబీ మరియు గోపీచంద్ మలినేని ఈ ఇద్దరు ఈ చిత్రాలకు దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమాల పట్ల ఎంతో క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి. ఇంకో కొస మేరుపు ఏమిటంటే ఈ రెండు సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించింది ఓకే హీరోయిన్ శృతిహాసన్ ఈ రెండు చిత్రాలలో హీరోయిన్గా నటించింది.

ఇక రవితేజ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించగా ఆ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. బాలకృష్ణ వీర సింహా రెడ్డి చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య కూడా ఇప్పుడు మంచి పోటీ నెలకొంది అని చెప్పాలి. విడుదల తేదీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రాలకు సంబంధించిన అప్డేట్లు ఒక్కొక్కటిగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాల యొక్క పాటలు విడుదల కాబోతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: