అరుదైన రికార్డు వైపు సుజిత్ అడుగులు !

Seetha Sailaja
దర్శకుడు సుజిత్ ఇప్పటివరకు తీసినవి కేవలం రెండు సినిమాలు మాత్రమే అయితే ఇండస్ట్రీలో అతడి పేరు తెలియని వారుండరు. శర్వానంద్ తో తీసిన ‘రన్ రాజా రన్’ విజయం తరువాత అతడికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభాస్ తో సినిమా చేయాలి అన్న ధ్యేయంతో దాదాపు నాలుగు సంవత్సరాలు పైగా ప్రభాస్ కోసం ఎదురుచూసి అత్యంత భారీ బడ్జెట్ తో ‘సాహో’ ను నిర్మించాడు.

ఈసినిమా విడుదల కాకముందు ఇండస్ట్రీలోని వారంతా సుజిత్ అంత అదృష్టవంతుడు ఉండడు అంటూ ఆకాశానికి ఎత్తేసారు. అయితే ‘సాహో’ విడుదలై ఫ్లాప్ గా మారిన తరువాత సుజిత్ వైపు చూసినవారు చాల తక్కువ మంది. చిరంజీవి సుజిత్ కు ‘గాడ్ ఫాదర్’ మూవీ విషయంలో అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ చివరికి వచ్చే సరికి సుజిత్ పై నమ్మకంలేక మోహన్ రాజ వైపు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.

ఆ షాక్ నుండి సుజిత్ తేరుకోవడానికి చాలా సమయం పట్టింది అంటారు. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయబారాలు సలహాలతో సుజిత్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఒక యాక్షన్ మూవీ కథను చెప్పడం ఆకథ పవన్ కు నచ్చడంతో అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పవన్ సుజిత్ ల కాంబినేషన్ మూవీ రాబోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సుజిత్ ను తన వద్దకు పిలిపించుకుని ప్రస్తుతం తనకు ఉన్న రాజకీయ ఒత్తిడిలు వల్ల సుజిత్ సినిమాను ఇప్పట్లో చేయలేనని 2024 ఎన్నికల తరువాత మాత్రమే సుజిత్ సినిమా గురించి ఆలోచన చేస్తానని అందువల్ల అప్పటి వరకు తన గురించి వేచి చూడకుండా మరో హీరోతో సినిమా చేసుకోమని సలహా ఇచ్చినట్లు టాక్. అయితే సుజిత్ మాత్రం తాను ఎంత ఆలస్యం అయినా పవన్ తో మాత్రమే సినిమా తీస్తాను అని చెపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో సుజిత్ తాను ఎంచుకున్న హీరో కోసం సంవత్సరాలు తరబడి వేచి చూసే అరుదైన రికార్డును సొంతం చేసుకోబోయే దర్శకుడుగా మారుతున్నాడా అని అనిపించడం సహజం..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: