ఎన్టీఆర్ ఆఫర్ ను వాడుకోలేకపోయిన డైరెక్టర్.. ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లేనా..!?

Anilkumar
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. నటుడిగా తనలోని సత్తాను నిరూపించుకుని సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.ఇక వరుస హిట్లతో సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్.. తన 30వ సినిమాను కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.అయితే  ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో ఇంకా ఆలస్యం అవుతోంది.  ఇక ఇదిలా ఉండగా.. తారక్ దీని తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తోనూ సినిమా చేయబోతున్నాడు. 

అయితే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.కాగా ఈ క్రమంలోనే అతడు 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతోనూ ఓ ప్రాజెక్టు చేస్తాడనే టాక్ వచ్చింది.అయితే ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కించే ప్రాజెక్టు స్పోర్ట్స్ బేస్ స్క్రిప్టుతో రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక దీన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. ఇక వాస్తవానికి ఈ ప్రాజెక్టు కోసం బుచ్చిబాబు గతంలోనే ఎన్టీఆర్‌కు స్టోరీని వినిపించాడు. కానీ, ఇక  అందులో అతడు మార్పులు చెప్పాడట.

 అయితే అలా పలుమార్లు ఛాన్స్ ఇచ్చినా బుచ్చిబాబు మాత్రం తారక్‌ను ఇంప్రెస్ చేయలేకపోయాడని తెలిసింది. ఇక దీంతో ఈ స్టార్ హీరో ఈ సినిమాను చేయనని చెప్పినట్లు తాజాగా ఓ న్యూస్ తెలిసింది.ఇదిలావుంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ తన కథను రిజెక్ట్ చేయడంతో బుచ్చిబాబు సన వేరే హీరోలను కూడా సంప్రదిస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.అయితే  ఈ క్రమంలోనే అతడు ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కూడా ఈ స్క్రిప్టును వినిపించాడనే టాక్ వినిపిస్తోంది.ఇక  దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: