పూజా హెగ్డే మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టేనా..?

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత భారీ పాపులారిటీని దక్కించుకున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే అలవైకుంఠపురం సినిమా వరకు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక  పూజా హెగ్డే ఉన్నట్టుండి తన కెరియర్ డిజాస్టర్ వైపు వెళ్ళింది. వరుసగా ఇటీవల ఈమె నటించిన రాధే శ్యామ్, ఆచార్య బీస్ట్ వంటి సినిమాలు వరుసగా బెడిసి కొట్టగా ఆ తర్వాత సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంది. ఇక తనకు సంబంధించిన ఒక ఫోటోను కూడా షేర్ చేసుకోలేదు.  అంతేకాదు తన కాలికి అయిన గాయం కారణంగా ఈమె ఒక ఫోటోషూట్ కూడా షేర్ చేసుకోలేదు అనే వార్తలు కూడా వినిపించాయి.
ఇక కాలికి గాయం అవడంతో షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని హాయిగా ఇంట్లో ఎంజాయ్ చేస్తోంది . తన హెల్త్ అప్డేట్స్ తో ఫాన్స్ ను అలరిస్తున్న ఈ అమ్ముడు అప్పుడప్పుడు మేకప్ ప్లేస్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా గ్లామర్ షో కన్నా తన ఓరకళ్ళతో కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలో స్కిన్ షో తో మెప్పిస్తూ .. సోషల్ మీడియాలో ఆ డోస్ మరింత పెంచేసింది.  మరీ ముఖ్యంగా ఏ ఫోటో షూట్ చేసినా థైస్ కనిపించే విధంగా దుస్తులు ధరించి యువత గుండెల్లో రైలు పరిగెడేలా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్యాక్ ఫోసులతో బెంబేలెత్తిస్తోంది.
ఇకపోతే ఈమె సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో అవకాశాన్ని అందుకుంది. అలాగే పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా ఎంపికయింది ప్రస్తుతం పవన్ సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు.. కాబట్టి మహేష్ బాబు సినిమాకు ఈ మంత్ ఎండింగ్ కల్లా పూజ హెగ్డే షూటింగ్లో పాల్గొంటుందని తెలుస్తోంది. మొత్తానికి అయితే తన సినిమాల ద్వారా బ్యాక్ టు బ్యాక్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: