పొన్నియిన్‌ సెల్వన్ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన త్రిష..!!

murali krishna
సీనియర్ హీరోయిన్ త్రిష కెరీర్ మళ్లీ గాడిన పడింది. గత కొన్నేళ్లు గా సరైన హిట్‌లేక ఫేడౌట్ హీరోయిన్ల జాబితా లో చేరిపోయిన త్రిష కెరీర్ ఒక్క సారి మళ్లీ ఊపందు కుంది.ఇప్పుడు ఆమె చేతిలో బోలెడు సిని మాలు ఉన్నాయి. ఆమె డేట్స్ కోసం దక్షిణాది ప్రొడ్యూ సర్లు మళ్లీ పోటీప డుతున్నారు. దీనికి కారణం ఇటీవల ఆమె నటించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌'మూవీ. మణిరత్నం దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీలో త్రిష యువరాణి కుందవై పాత్రని పోషించింది. 
త్రిష కెరీర్‌లోనే అత్యంత అందంగా, హుందాగా కని పించిన మూవీ ఇదే. 39 ఏళ్ల వయసు లోనూ త్రిష అందా నికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్‌లో బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా పుణ్య మా అని త్రిషకి మళ్లీ ఆఫర్లు కూడా పెరిగాయి.
ఇప్పటికే అజిత్ మూవీకి సైన్ చేసిన త్రిష.. విజయ్ నటిం చబో తున్న మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమా లకి తాను ముందు తీసుకుం టున్న రెమ్యూన రేషన్ కంటే డబుల్ కోరగా ప్రొడ్యూసర్లు కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తు న్నాయి. టాలీవుడ్‌లో ఒక ప్పుడు టాప్ హీరోయి న్‌గా వెలిగిన త్రిష గత 5-6 ఏళ్లుగా తమిళ్ సినిమాల కే పరిమితమైంది. 'పొన్నియిన్‌ సెల్వన్‌'మూవీ కి ఆమె కోటిన్నర రెమ్యూన రేషన్ తీసుకు న్నట్లు టాక్. అయితే అజిత్, విజయ్‌ తోకలిసి నటించ బోయే సినిమాలకి ఆ రెమ్యూనరే షన్‌ని డబుల్ చేసింది.'పొన్ని యిన్‌ సెల్వన్‌' సీక్వెల్ కూడా వచ్చే ఏడాది అక్టోబరులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అటు రెమ్యూనరేషన్ రెట్టింపు, ఇటు వరుస ఆఫర్లతో త్రిష డబు ల్ ప్రమోషన్ కొట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: