ఆదిపురుష్ రీషూట్ ఆలోచనలు వాస్తవ రూపానికి వస్తాయా ?

Seetha Sailaja
సంక్రాంతి రేస్ కు రావలసిన ‘ఆదిపురుష్’ ను సమ్మర్ రేస్ కు వాయిదా వేయడంతో ప్రభాస్ అభిమానులు తెరిపిన పడ్డారు. ఈమూవీకి సంబంధించి విడుదల చేసిన టీజర్ లోని గ్రాఫిక్స్ క్వాలిటీ ఏమాత్రం బాగాలేదు అన్న విమర్శలు విపరీతంగా రావడంతో తిరిగి గ్రాఫిక్ వర్క్స్  పై దృష్టి పెట్టడానికి ఈమూవీని ఇలా వాయిదా వేసి ఉంటారు అని భావించారు. అయితే అసలు వాస్తవం వేరు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈమూవీకి సంబంధించి కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని దర్శకుడు ఓమ్ రౌత్ భావించి ఈమూవీ విడుదల వాయిదా వేసి ఇప్పుడు ప్రభాస్ డేట్ కోసం ఎదురు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ అదేవిధంగా నాగ్ అశ్విన్ మారుతి ల సినిమాల షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా ఈమూడు సినిమాలకు తన డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు ‘ఆదిపురుష్’ కు సంబంధించిన కొన్ని సీన్స్ రీషూట్ అంటే ఎలా తన డేట్స్ ఎడ్జెస్ట్ చేయాలి అన్న టెన్షన్ లో ప్రభాస్ ఉన్నట్లు టాక్. ‘ఆదిపురుష్’ మూవీని అంతర్జాతీయ స్థాయిలో పాన్ ఇంటర్ నేషనల్ మూవీగా తీస్తున్నారు. త్రీడీ లో తీస్తున్న ఈమూవీలో గ్రాఫిక్స్ క్వాలిటీ ఏమాత్రం నాసిగా అనిపించినా ప్రేక్షకులు వెంటనే తిరస్కరిస్తారు.

వచ్చేనెలలో విడుదల కాబోతున్న ‘అవతార్ 2’ లోని హై క్వాలిటీ గ్రాఫిక్స్ చూసిన ప్రేక్షకులు ‘ఆదిపురుష్’ నాసిరకం క్వాలిటీ గ్రాఫిక్స్ ను చూసి తట్టుకోలేరు. ఈ పరిస్థితిలో ఈమూవీకి సంబంధించిన చాల సీన్స్ రీషూట్ చేయించి తిరిగి క్వాలిటీ గ్రాఫిక్స్ విషయంలో శ్రద్ద వహించవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ‘ఆదిపురుష్’ మూవీ రీషూట్ కు ప్రభాస్ ఏదోవిధంగా సహకరించవలసి ఉంటుంది. అయితే ఇన్ని సినిమాల షూటింగ్ ల ఒత్తిడి మధ్య ప్రభాస్ ఓమ్ రౌత్ కోరికను తీర్చడానికి చాల సమయం పడుతుంది. అందువల్ల ఇప్పుడు ఈమూవీ కనీసం సమ్మర్ రేస్ కు అయినా వస్తుందా రాదా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: