ఎప్పటికైనా ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తానంటున్న... జాతిరత్నాలు హీరోయిన్..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఫరియా అబ్ధుల్లా ఆ సినిమాలో నటించడంతో లక్కీ హీరోయిన్ అయ్యింది.ఇక కెరియర్ లో ఆచి తూచి అడుగులేస్తున్న అమ్మడు జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్టైనా వచ్చిన ప్రతి ఆఫర్ ను ఓకే చేయకుండా తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తా అంటుంది.అయితే  లేటెస్ట్ గా సంతోశ్ శోభన్ హీరోగా వస్తున్న లైక్ షేర్ సబ్ స్చ్రైబ్ సినిమాలో నటించింది అమ్మడు. కాగా ఈ సినిమాలో ఓ యూట్యూబర్ గా ఫరియా కనిపించనుంది.ఇకపోతే నవంబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో హీరోయిన్ ఓ రేంజ్ లో పాల్గొంటున్నారు. 

ఇక ఈమధ్య ఎక్కడ చూసినా సరే లైక్ షేర్ సబ్ స్చ్రైబ్ సినిమా సందడిలో భాగంగా ఎక్కడ చూసినా సరే వీరిద్దరే కనిపిస్తున్నారు.  తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే అక్కడ వారి కెరియర్ ఎలా మొదలైంది అన్న విషయాలను వివరించారు. ఫరియా అబ్ధుల్లాని తన కాలేజ్ లో చూసి నాగ్ అశ్విన్ తనని హీరోయిన్ గా చేస్తావా అని అడిగారట.. ఆ తర్వాత నేనే ఆయన్ను ఫాలో అప్ చేసి ఆడిషన్స్ చేసి జాతిరత్నాలు ఛాన్స్ అందుకున్నా అని చెప్పారు ఫరియా అబ్ధుల్లా. ఇక ఫాదర్ ఆటోమొబైల్ బిజినెస్ చేస్తారని.. ఫ్యామిలీ దుబాయ్ లో ఉంటారని. తను స్టడీస్ కోసం ఇక్కడ ఉంటున్నానని అన్నారు ఫరియా.

అంతేకాదు ఎలగైనా సరె రాజమౌళి సినిమాలో నటించాలని అంటున్నారు ఫరియా అబ్ధుల్లా. ఇక అలాంటి గోల్డెన్ ఛాన్స్ రావాలని కోరుతున్నా అని అన్నారు.  తనంటే తనకు చాలా ఇష్టమని. ఎక్కడకి వెళ్లినా తను ఒక్కదాన్నే వెళ్తానని అంటున్నారు ఫరియా. ఇకపోతే టాలీవుడ్ లో మంచి హైట్ ఫిజిక్ ఉన్న హీరోయిన్ గా ఫరియా అదరగొట్టబోతుంది. ఇక జాతిరత్నాలు హిట్ కొట్టగా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే ఆమె కోరినట్టు రాజమౌళి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాడని చెప్పొచ్చు.  కెరియర్ లో చాలా ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నానని చెప్పిన ఫరియా డైరక్షన్ వైపు కూడా ఆసక్తి ఉందని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు  ఇక పాతికెళ్లు ఇండస్ట్రీలో ఉంటానని చెబుతున్న అమ్మడి గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు ఆడియన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: