సమంత అనారోగ్యంతో విజయ్ దేవరకొండ ఆలోచనలలో మార్పులు !

Seetha Sailaja

విజయ్ దేవరకొండకు నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసి రావడంలేదు. ‘లైగర్’ భారీ ఫ్లాప్ తరువాత విజయ్ దేవరకొండ సమంత తో కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. కాశ్మీర్ నేపధ్యంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ ఒకప్పుడు మణిరత్నం తీసిన ‘రోజా’ సినిమాను పోలి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి రాబోతున్న క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేస్తూ ఈ మూవీని డిసెంబర్ లో విడుదల చేయాలని భావించారు. ఇంచుమించు ఈ మూవీ షూట్ అంతా కూడ పూర్తి అయిపోయింది. ఇక సమంత విజయ్ దేవరకొండల పై చిత్రీకరించవలసిన రెండు పాటలు మరికొన్ని సీన్స్ మిగిలి ఉన్నాయి అని అంటున్నారు. ప్రస్తుతం సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న పరిస్థితులలో ఆమె ఈవ్యాధి నుండి ఎప్పుడు పూర్తిగా కోలుకుంటుందో తెలియని పరిస్థితి.

దీనితో ఆమె గురించి వేచి చూస్తూ కాలం గడిపెకన్నా మరొక సినిమాను లైన్ లో పెడితే బాగుంటుందని విజయ్ ఆలోచనలు చేస్తున్నాడు అన్నసంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ దిల్ రాజ్ తో ఒక సినిమా చేయడానికి అడ్వాన్స్ కూడ తీసుకున్నట్లు టాక్. ఇప్పుడు ‘ఖుషీ’ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు కాబట్టి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయవలసి ఉన్న మూవీని దిల్ రాజ్ బ్యానర్ లో వేగంగా పూర్తి చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన విజయ్ కు వచ్చింది అంటున్నారు.

ఈమూవీని పక్కకుపెట్టి మరో ప్రముఖ దర్శకుడుతో మూవీ చేయాలని విజయ్ ప్రయత్నిస్తున్నప్పటికీ టాప్ దర్శకులు అందరూ బిజీగా ఉండటంతో విజయ్ కు గౌతమ్ తప్ప మరొక ఆప్క్షన్ లేకుండా పోయింది అని తెలుస్తోంది. వాస్తవానికి విజయ్ దృష్టిలో సుకుమార్ కొరటాల శివ లాంటి దర్శకులు చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుతం వారంతా చాల బిజీగా ఉండటంతో ఇప్పట్లో వారితో సినిమాలు చేసే అవకాశం విజయ్ దేవరకొండకు ఉండకపోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: