SSMB28: ఫ్యాన్స్ జస్ట్ రిలాక్స్.. త్వరలోనే షూటింగ్?

Purushottham Vinay
తెలుగు అగ్ర నటుడు సూపర్  స్టార్  మహేష్  బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న SSMB28 నుండి బోలెడన్ని గాసిప్పులు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆరంభం నుండి ఈ సినిమా చుట్టూ వివిధ రకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.నాలుగు రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యుల్ తర్వాత రెండో షెడ్యుల్ కి బాగా గ్యాప్ వచ్చేసింది. మధ్యలో మహేష్ తల్లి గారు ఇందిరా దేవి గారు చనిపోవడం తెలిసిందే. కానీ తల్లి పెద్ద కర్మ అనంతరం కూడా మహేష్ త్రివిక్రమ్ సినిమాను రీస్టార్ట్ చేయకపోవడం , మధ్యలో ఫారిన్ ట్రిప్ కి వెళ్ళడం అందరికీ ఈ ప్రాజెక్ట్ మీద అనుమానాలు క్రియేట్ అయ్యేలా చేశాయి.దీంతో అసలు ఈ సినిమా ఇక లేనట్టేనని , మహేశ్  బాబు త్రివిక్రమ్ వర్క్ మీద అసంతృప్తిగా ఉన్నాడని అందుకే ఉన్నపళంగా రెండో షెడ్యుల్ స్టార్ట్ చేయకుండా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడని అవి ఇవి చేర్చి గాసిప్పులు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ కి చాలా టైం తీసుకున్నారు.


ఎనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత చాలా నెలలకి సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఆ మధ్యలో కూడా పలు గాసిప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.తాజాగా సోషల్ మీడియాలో రెండు పెద్ద సినిమాలు ఆగిపోనున్నాయని పోస్ట్  అనేది కనిపించగానే యాంటీ ఫ్యాన్స్ అంతా అందులో ఒకటి మహేష్ -త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అంటూ కామెంట్స్  వేయడం మొదలు పెట్టారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. వెంటనే నిర్మాత నాగ వంశీ రంగంలోకి దిగి సినిమాకు సంబంధించి రెండో షెడ్యుల్ త్వరలోనే ప్రారంభం కానుందని మరికొన్ని రోజుల్లో ఫుల్ అప్ డేట్స్ రానున్నాయని చెప్పి అభిమానులను కూల్ చేశారు.ప్రస్తుతం మహేష్ బాబు తన తల్లి చనిపోయిన బాధలో వున్నాడు. ఆ బాధని తగ్గించుకోడానికి ట్రిప్ లకి ఫ్యామిలీతో వెళుతున్నాడు. ఆయన మనసు కొంచం కుదుటపడ్డాక తిరిగి షూటింగులో పాల్గొంటాడని సన్నిహితుల నుంచి వార్తలు తెలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: