స్టార్ హీరో ప్రభాస్ అభిమానలకు బారి షాక్..!!

murali krishna
బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి ఆ రేంజ్ మూవీ రాలేదు. కనీసం హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ పడలేదు. సాహో, రాధే శ్యామ్ ప్రేక్షకులను నిరాశపరిచాయి.
సాహో కొంత బెటర్. హిందీలో రూ. 160 కోట్లకు పైగా వసూళ్లతో హిట్ స్టేటస్ అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 450 కోట్ల వసూళ్ల వరకు సాహో రాబట్టింది అని చెప్పొచ్చు. రాధే శ్యామ్ మాత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ భారీ మొత్తంలో నష్టాలు మిగిల్చింది. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్ కమ్ బ్యాక్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు మరీ

ఆదిపురుష్ మూవీతో వాళ్ళ దాహం తీరుతుందని నమ్మకంగా ఉన్నారు. ఆదిపురుష్ సంక్రాంతికి విడుదలవుతుందన్న వార్త వాళ్ళను సంతోషంలో నింపింది అని మనం చెప్పవచ్చు. సినిమా పండుగగా చెప్పుకునే సంక్రాంతికి ప్రభాస్ సంచలనాలు చేస్తారని ఫ్యాన్స్ విశ్వాసంతో ఉన్నారు. అయితే వాళ్ళ ఆశలపై మేకర్స్ నీళ్లు చల్లినట్లు  మనకు తెలుస్తోంది. ఆదిపురుష్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిస్తుంది.
2023 జనవరి 12న ఆదిపురుష్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు చాలా కాలం క్రితమే ప్రకటించారు మరీ అనూహ్యంగా మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట. ఆదిపురుష్ సమ్మర్ కి పోస్ట్ ఫోన్ అయ్యిందంటూ డిస్ట్రిబ్యూటర్స్ హింట్ ఇస్తున్నారు. ఆదిపురుష్ విడుదల వాయిదా అనివార్యమే అంటూ టాలీవుడ్ వర్గాలు బాగా వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగిలినట్లే అని చెప్పొచ్చు పెద్ద పండుగ నాడు అభిమాన హీరో మూవీ సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాలన్న ఆశలకు గండిపడ్డట్లే.
ఆదిపురుష్ టీజర్ పై తీవ్ర విమర్శలపాలైన నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు అని భావించవచ్చు. సమయం తీసుకొని మెరుగైన అవుట్ ఫుట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని బావిస్తున్నారేమో అనిపిస్తుంది. టీజర్లో రామునిగా ప్రభాస్, రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్స్ విమర్శల పాలయ్యాయి. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ చాలా నాసిరకంగా టీవీ సీరియల్స్ ని తలపించింది. ప్రభాస్ లాంటి హీరోతో కార్టూన్ మూవీ తీశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ చిత్రాన్ని వీలైనంత మేర గొప్పగా మలిచే ప్రయత్నం చేస్తున్నారన్న ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: