ఆది పురుష్ సినిమా కి అదే హైలైట్ కాబోతుంది!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ భారీ ప్రాజెక్టు ఆది పురుష్ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కావడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రామాయణం ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తూ ఉండడం విశేషం. ఆ విధంగా ఈ సినిమా పట్ల ఇటు బాలీవుడ్ లో అటు సౌత్ లో రెండు భాషలలో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేసే సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని భావించి ప్రభాస్ కి చిత్రాన్ని చేయడం జరిగింది. యాక్షన్ చిత్రంగా వచ్చిన సాహో ప్రేమకథ సినిమాగా వచ్చిన రాధేశ్యామ్ చిత్రాలు రెండు కూడా ప్రభాస్ కు మంచి ఫలితాలను తెచ్చి పెట్టలేదు అందుకే ఇప్పుడు చేస్తున్న ఈ ఆది పురుష్ చిత్రం భారీ విజయం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ స్థాయిలో వారిని అలరించాయి. ఈ సినిమాపై అంచనాలను కూడా పెంచాయి. 

ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ అయ్యే అంశాలను ప్రభాస్ అభిమానులు చెప్పుకోవడం విశేషం. మొదటి నుంచి చెప్పుకుంటున్నట్లుగా విఎఫ్ఎక్స్ ఈ సినిమాలో హైలైట్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయం సినిమా నుంచి విడుదలైన టీజర్  బట్టి ఇది అర్థమవుతుంది. గత కొన్ని సినిమాలుగా విఎఫ్ఎక్స్ ను ఆధారంగా చేసుకుని చిత్రాలను చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో కూడా ఎక్కువగా దానిని వాడినట్లుగా తెలుస్తుంది. ఇవి తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా మెస్మరైజ్ చేస్తాయని అంటున్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా రామాయణాన్ని ఇప్పుడు తెరపై చూడబోతున్నారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: