రిపోర్టర్ పైన ఫైర్ అయిన అను ఇమ్మాన్యుమేల్..!!

Divya
మలయాళం సినిమాతో మొదటిసారి తన కెరీర్ని ప్రారంభించింది హీరోయిన్ అను ఇమ్మాన్యుమేల్ ఆ తర్వాత హీరో నానితో మజ్ను సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. అయినా కూడా ఈమె కెరియర్ మాత్రం మారలేదు. కానీ వరుస ప్లాపులతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈమె కెరియర్ క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది. గత ఏడాది విడుదలైన మహాసముద్రం సినిమాలో కూడా నటించి బారి డిజాస్టర్ ను చవి చూసింది.

ఇక ఇప్పుడు తాజాగా అల్లు శిరీష్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా జోరుగా ప్రమోషన్స్ నిర్వహించారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లు శిరీష్  ,అను ఇమ్మాన్యుమేల్ జంటగా పాల్గొన్నారు. అయితే ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ పై అను చాలా ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం అల్లు అర్జున్ ,అల్లు శిరీష్ ల పైన ప్రశ్న ఎదురవ్వడమే అన్నట్లుగా తెలుస్తోంది.
అసలేం జరిగింది అంటే ఒక రిపోర్టర్ అల్లు అర్జున్తో వర్క్ చేశారు అలాగే అల్లు శిరీష్ తో కూడా కలిసి పనిచేశారు ఇద్దరూ క్యూటెస్ట్ ఎవరు.. నాటి ఎవరు అనే ప్రశ్నించగా.. అయితే ఈ ప్రశ్న వినడానికి తప్పుగా లేకపోయినా అనుకి మాత్రం ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రశ్నలేవీ లేవు అడగడానికి మంచి ప్రశ్నలు అడగండి అంటూ ఆ రిపోర్టర్ పైన కోపాన్ని తెలియజేసింది అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. గత కొద్ది రోజులుగా అల్లు శిరీష్,అను ఇమ్మాన్యుమేల్ మధ్య ఏదో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: