ఈ క్రేజీ కాంబో విజయ్ దేవరకొండ కెరియర్ కు ప్లస్ అయ్యేనా...!!
దీంతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో భారీ స్థాయిలో చేయాలనుకున్న జనగణమన ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇక ఈ మూవీని పక్కన పెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివానిర్వాన దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. కాశ్మీర్ తో పాటు హైదరాబాదులో కూడా కొన్ని కీలకమైన ఘట్టాల చిత్రీకరణ పూర్తి అయింది. సమంత యూఎస్ కి వెళ్ళిన కారణంగా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూలు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించాలని.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
వీరిద్దరూ కలిసి శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన హరీష్ శంకర్ మాట్లాడుతూ.. క్రేజీ కాంబో సెట్ అవ్వడం ఖాయం అని అనిపిస్తోంది. త్వరలోనే ఎందుకు సంబంధించిన అన్ని విషయాలు తెలియజేస్తామని ఇండస్ట్రీలో తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కెరియర్ మారిపోతుందని ఆయన అభిమానులు ఆశాజనకంగా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా విజయ్ దేవరకొండ ఒక మంచి కథతో సినిమా తెరకెక్కిస్తే ఆయన కెరియర్ కచ్చితంగా మారుతుందని కూడా అభిప్రాయపడుతూ ఉండడం గమనార్హం.