పూరి డైరెక్షన్లో నెక్స్ట్ చేయబోయే హీరో ఎవరు..?

Divya
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన పూరి జగన్నాథ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కించి ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో కాస్త కలిసి రాలేదని చెప్పవచ్చు. తను ఏ సినిమా చేసిన కూడా బారి ఫ్లాప్ గా మిగలడంతో హీరోలు సైతం ఇప్పుడు మొహం చాటేసే పరిస్థితి ఏర్పడింది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా పెట్టి లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయగా ఘోరమైన పరాజయాన్ని చూసింది. దీంతో అటు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఈ సినిమా పైన చాలా నిరుత్సాహ చందారు.

ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ తన తదుపరిచిత్రంతో ఎవరితో నటిస్తారని విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి లైగర్ సినిమా కి ముందే పూరి విజయ్ కాంబినేషన్లో జనగణమన చిత్రాన్ని అనౌన్స్మెంట్ చేశారు అయితే ఈ సినిమా కేవలం కొద్దిగా బాగా మాత్రమే షూటింగ్ చేసుకున్నట్లుగా సమాచారం. దీంతో ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూరి తన తదుపరిచిత్రం కోసం హీరో కోసం బాగా గాలిస్తున్నట్లుగా సమాచారం.

తన తదుపరిచిత్రం బాలకృష్ణతో లేదా రామ్ పోతినేని చిరంజీవితో జరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా ఈ విషయాలపై ఎలా ఏ విధంగా అధికారికంగా ప్రకటన రాలేదు. దీంతో పూరి జగన్నాథ్ అభిమానులు ఇవ్వ హీరోలతో సినిమా చేయడానికి ట్రై చేస్తే బాగుంటుందని కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి పూరి జగన్నాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే విషయం తెలియాల్సి ఉంది. మరి పూరి జగన్నాథ్ కి సక్సెస్ ఇచ్చి ఆ హీరో ఎవరు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: