వావ్: ఆది పురుష్ సినిమా అరుదైన ఘనత..!!

Divya
హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కేవలం గ్రాఫిక్స్ మళ్లీ ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతోంది. అయితే ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది బాగుందని అనగా మరి కొంతమంది గ్రాఫిక్స్ పెద్దగా అనిపించలేదని ఒక కార్టూన్ మూవీ లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ సినిమా రామాయణం కథ అంశంతో  పై తీసిన ఈ సినిమా ప్రభాస్ రాముడు పాత్రలో నటించారు. కృతి సనన్ కూడా సీత పాత్రలో నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ ఇన్ని విమర్శలు వచ్చినా సరే డైరెక్టర్ ఓం రౌత్ మాత్రం ఈ చిత్రం పైన వెనకడుగు వేయలేదు. అయితే ఇన్నివైపులా ఈ సినిమా చుట్టు పలు విమర్శలు చుట్టుముట్టినా సరే ఆదిపురుష్ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదని నిరూపితం అయింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది గూగుల్లో వెతికిన టీజర్ గా ఆది పురుష్ చిత్రం నిలిచింది 30 రోజులలోగా గూగుల్లో అత్యధిక వెతికింది ఈ సినిమా గురించే నట అన్ని టాపిక్ ల కంటే ఎక్కువగా ఈ సినిమా టీజర్ గురించి వెతికినట్లు సమాచారం.

ఇదే విషయాన్ని తెలియజేస్తూ యువి క్రియేషన్ సంస్థ తాజాగా తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆది పురుష్ సినిమా ప్రతిరోజు ఇంకా పైపైకి చేరుతూనే ఉంది అది ఎంత పైకి అన్నది ఈ గుణం కాదే చెబుతాయి అంటూ గూగుల్లో సెర్చ్ లో టాప్ లో ఉన్న ఆదిపురుష్ సినిమా పోస్టర్ను ట్విట్టర్ నుంచి షేర్ చేసింది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: