బాలయ్య వారసుడు సినీ ఎంట్రీ పై వేణు స్వామి ఏమన్నారంటే..?

murali krishna
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎక్కువగా సెలబ్రిటీల భవిష్యత్తు గురించి జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో చెబితే ..
మరి కొంత మందికి భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఎలాంటి దారిలో వెళ్తే సక్సెస్ అవుతారు అన్న విషయాలను కూడా ఆయన తెలియజేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు గత కొద్ది రోజుల నుంచి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు ప్రస్తుతం కథ కూడా సిద్ధం అయిందని , డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు అని అందుకు తగ్గట్టుగా మోక్షజ్ఞ కూడా నటనలో శిక్షణ తీసుకున్నాడు అనే వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంపై వేణు స్వామి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
బాలకృష్ణ అభిమానులు వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం గత సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడు అని చెప్పినా .. ఆ సమయంలో మాత్రం మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ఇక అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి.. ఇదే విషయంపై వేణు స్వామి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు ప్రతిరోజు రాహుకాలం, యమగండం కాలాన్ని చూస్తారు.ఇక బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసినా.. చెప్పిన టైం నుంచి టైమ్ దాకా చెక్ చేసుకుంటారని ఆయన తెలిపారు. ఇక బాలయ్యకు మనం చెప్పాల్సిన అవసరం లేదు అని బాలకృష్ణ అన్ని ఫాలో అవుతారని కూడా వేణు స్వామి వెల్లడించారు.
మోక్షజ్ఞ జాతకం కూడా చూశానని మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడానికి ఇంకా టైం ఉందని , కానీ ఆయన సినీ కెరీర్ కచ్చితంగా బాగుంటుందని కూడా వేణు స్వామి వెల్లడించారు. ఇకపోతే కుటుంబ సభ్యులు మాత్రం వీలైనంత ఆలస్యంగా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రావాలి అంటే మరో మూడు సంవత్సరాల సమయం పడుతుంది అని షాకింగ్ కామెంట్లు కూడా చేశారు వేణు స్వామి. మరి మోక్షజ్ఞ విషయంలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజం అవుతాయో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: