మంచు విష్ణు "జిన్నా" మూవీ నుండి సత్యం రాజేష్ కు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు ఆఖరుగా మోసగాళ్లు అనే మూవీ లో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన మోసగాళ్లు మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో మోసగాళ్లు మూవీ బాక్సాఫీస్ దగ్గర చివరగా అపజయం పాలయ్యింది. ఇది ఇలా ఉంటే మోసగాళ్లు మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన కాజల్ అగర్వాల్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇలా మోసగాళ్లు మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయినా మంచు విష్ణు తాజాగా జిన్నా అనే మూవీ లో హీరో గా నటించాడు.
 

ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ ,  సన్ని లియోన్ హీరోయిన్ లుగా నటించగా ,  ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా జిన్నా మూవీ నుండి సత్యం రాజేష్ కు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. సత్యం రాజేష్ ఈ మూవీ లో పండు పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తూ సత్యం రాజేష్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో సత్యం రాజేష్ బైక్ పై కూర్చుని ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: