ఆది పురుష్ చిత్రంపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!!

Divya
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్నది. సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఇక వచ్చే ఎడది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతున్నది. ఇక తాజాగా కొద్దిరోజుల క్రితం ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేయగా మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నదని ముఖ్యంగా కార్టూన్ సినిమాలగా తలపిస్తుందని సోషల్ మీడియాలో టోల్స్ వినిపిస్తూ ఉన్నాయి. టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా తాజాగా ఈ టీజర్ పైన తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఆది పురుష టీజర్ చూడగానే మోసం చేసినట్టు అనిపించిందని మంచు విష్ణు చాలా అసంతృప్తిగా బాలీవుడ్ మీడియాలో మాట్లాడుతూ బహిరంగంగా తెలియజేశారు. రామాయణం మీద అంటే లైవ్ యాక్షన్ మూవీ అనుకున్నానమని యానిమేషన్ చిత్రమవుతుందను కోలేదని అందుచేతనే నిరాశ చెందామని తెలియజేశారు మంచు విష్ణు. మేకర్స్ ముందుగా ఇదోక యానిమేటెడ్ సినిమా అని ప్రేక్షకులకు ప్రిపేర్ చేసి ఉంచితే బాగుంటుందని ఎలాంటి ట్రోల్స్ వచ్చేవి కాదని తెలియజేశారు మంచు విష్ణు.
మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.ఈ చిత్రంలో సన్నీలియోన్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని మలయాళం హిందీ భాషలలో కూడా విడుదల చేస్తున్నారు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని జిన్నాభాయ్ అనే పేరుతో ప్రమోట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆది పురేష్ సినిమా టీజర్ పైన కొనసాగుతున్న ట్రోలింగ్ గురించి తన ఆలోచనలను షేర్ చేయడం జరిగింది. తెలుగు వారీగా తన అభిప్రాయాన్ని తెలియజేశాను రామాయణం మీద తీస్తున్న సినిమా కాబట్టి అందరూ ఊహించినంత విధంగా కనిపించలేదని అందుకే అందరూ నిరాశతో ఉన్నారని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: