వాడు అలా అనటం వల్లే నా లైఫ్ ఇలా తయారైయింది అంటూ ఫైర్ అయిన సమంత..

murali krishna
తెలుగు ఇండస్ట్రీలో నాగచైతన్య సమంత అంటే అందరికీ సుపరిచితమే. వీళ్లిద్దరు ఏ మాయ చేసావే సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంకా రెండు మూడు సినిమాల్లో నటించారు.
ఇక వీరిద్దరూ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్డమ్ సంపాదించుకున్నారు. అయితే వీరు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక విడాకులు తర్వాత ఎవరికి వారు సినిమాల పరంగా బిజీ అయిపోయారు. వీరిద్దరూ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. ఇక ఈ విషయం పక్కన పెడితే నాగచైతన్య సమంత విడిపోవడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ మొదటి సినిమాతోనే ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరు విడాకులు తీసుకున్న సంవత్సరం అయిపోయినా కూడా వీరి విడాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ విడాకులకు గల సరైన కారణం ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు. వీరి విడాకులపై ఎన్నో రూమర్లు తెరమీదకు వచ్చాయి. అంతే కాదు ప్రతి రోజు ఏదో ఒక కొత్త వార్త విడాకులపై వినిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి సమంత విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేశారు అనే రూమర్ వినిపిస్తోంది. ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామి అంటే అందరికీ తెలుసు. ఈయన గత కొన్ని రోజులుగా సెలబ్రిటీల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటివరకు ఈయన చెప్పిన విషయాలలో కొన్ని నిజమయ్యాయి కొన్ని అబద్ధం.
అయితే గతంలో సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పుడే వేణు స్వామి వీళ్లిద్దరు విడిపోతారని చెప్పాడట. అంతేకాదు పెళ్లి చేసుకోవడం కూడా వేస్ట్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక వేణుస్వామి చెప్పినట్టుగానే పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నామంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇక దీంతో చాలామంది ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయని ఆయన మాటలు నమ్ముతున్నారు. అయితే ఈ విషయంలో సమంత మాత్రం చాలా ఫైర్ అయిందట. ఏ ముహూర్తాన వేణు స్వామి గాడు మేము విడిపోతామని చెప్పాడో గాని వాడు చెప్పినట్టే మేము దూరం అయ్యాం. ఒకవేళ వాడు చెప్పకపోయినా మేం కలిసి ఉండే వాళ్లం కావచ్చు.వాడు చెప్పడం వల్ల మేము విడాకులు తీసుకున్నాం.. నా పరువు మొత్తం పోయింది అంటూ సమంత తన అమ్మతో చెప్పుకొని బాధ పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ వేణు స్వామి వల్లే మేం విడిపోయాం అని సమంత చెప్పింది అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: