పూరి జగన్నాథ్ అభిమానుల కోరిక తీర్చేనా..?

Divya
చాలామంది స్టార్ డైరెక్టర్లు తమిళ నటులుగా నటించడం జరిగింది. అలాంటి వారిలో కే భాగ్యరాజా కూడా ఒకరు. ఇక డైరెక్టర్ గౌతమ్ మేనన్, సముద్ర ఖని తదితరులు కూడా రాణిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. వీళ్ళ తరహాలోనే టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న కొంతమంది వీరి బాటలోనే ప్రయాణిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది . పూర్తి వివరాల్లోకి వెళ్తే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొద్దిరోజుల క్రితం గౌతమ్ మీనన్ రూపొందించిన ఏం మాయ చేసావే సినిమాలో అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రంలో నాగచైతన్య అసిస్టెంట్ డైరెక్టర్గా నటిస్తే తనకి డైరెక్టర్ గా నటించారు.
చాలా గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. జర్నలిస్టుగా ఈ సినిమాలో నటించారు దసరా బరిలో ఈ సినిమా విడుదల అవ్వాగా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ చేసిన క్యారెక్టర్ కూడా మంచి హిట్టును అందుకుంది. సినిమాలో జర్నలిస్టు గోవర్ధన్ గా నటించడానికి ముందు మొహమాట పడిన పూరి జగన్నాథ్ ఆ పాత్రలో నటించిన తర్వాత ఆ క్యారెక్టర్ గురించి చిరంజీవి ప్రమోషన్ లో తెలియజేయడంతో చాలా ఆనందపడినట్లుగా సమాచారం.

ఇక ఈ సినిమాతో పాటు త్వరలో విడుదలకు సిద్ధమైన ఓరి దేవుడా సినిమాల పూరి జగన్నాథ పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ దేవుడు పాత్రలో కనిపిస్తున్నారు.ఈ మూవీలో విశ్వక్ సేన్ దర్శకుడు కావాలని ఆశపడి యువకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ట్రైలర్ లో పూరి జగన్నాథ్ అభిమానులు ఆయనను చూసి చాలా సంబరపడిపోతున్నారు. మరి అభిమానులు కూడా పూరి జగన్నాథ్ ఒక  ఫుల్ సినిమా చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు పూరి జగన్నాథ్ వస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: