వేశ్య గృహంలో రెండు వారాలు ఉన్న ఆ స్టార్ హీరోయిన్..

murali krishna
రీసెంట్ గా తెలుగులో సీతారామం సినిమాతో ఇక్కడ  తెలుగు ప్రేక్షకులను చాలా బాగా అలరించింది మృణాల్ ఠాకూర్.
సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రకు ఆమె నూటికి నూరు పాళ్లు న్యాయం చేసిందని  మనం చెప్పొచ్చు. సినిమాలో మృణాల్ అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అంతేకాదు సీతారామం తర్వాత మృణాల్ కి తెలుగులో క్రేజీ ఆఫర్లు  బాగా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే మృణాల్ ఠాకూర్ ఓ రెండు వారాలు వేశ్య గృహంలో ఉండాల్సి వచ్చిందట. అదేంటి మృణాల్ ఏంటి వేశ్య గృహంలో ఎందుకు ఉంది.
అసలు ఆమెకు అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అంటే. ఆమె చేసిన లవ్ ఇండియా సినిమాలో పాత్ర కోసం అలా చేయాల్సి వచ్చిందట. లవ్ ఇండియా లో ఆమె వేశ్య పాత్రలో నటించింది. తండ్రి డబ్బుల కోసం కూతురిని వేశ్య గృహానికి పంపిస్తాడు. అయితే ఆ టైం లో వేశ్య గృహానికి వెళ్లి అక్కడ వారి బాధలను తెలుసుకుందట మృణాల్.అక్కడ ఉన్న రెండు వారాలు వారి బాధ విని బాగా డిప్రెషన్ లోకి వెళ్లిందట. ఆ డిప్రెషన్ నుంచి బయట పడటానికి చాలా మెడిసిన్స్ వాడిందట. వేశ్య పాత్ర వేస్తున్నంత మాత్రానా వేశ్య గృహాలకు వెళ్తారా అని కొందరు అంటున్నా.. అక్కడ వారి జీవితాల గురించి తెలుసుకుని ఇంకాస్త బాగా పర్ఫార్మ్ చేయొచ్చని మృణాల్ అలా చేయాల్సి వచ్చింది అంట.
అయితే మృణాల్ చేసిన ఈ అటెంప్ట్ కి కొందరు మాత్రం శభాష్ అనేస్తున్నారు. అంత కష్టపడ్డది కాబట్టే ఆమెకి ఇంత మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. సీతారామం సినిమా హిందీలో కూడా డబ్ అయ్యి అక్కడ  కూడా హిట్ కొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో మృణాల్ కి ఛాన్స్ ఇచ్చే టాక్ వినిపిస్తుంది. మహేష్, ఎన్.టి.ఆర్ సినిమాల్లో ఆమెని హీరోయిన్ గా తీసుకుంటున్నారట. మరి దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు రావాల్సి ఉంది. సీతారామం హ్యూజ్ సక్సెస్ అవడంతో మృణాక్ క్రేజ్ డబుల్ అయ్యింది. తెలుగులోనే కాదు ఆమెకు తమిళంలో కూడా బారి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: