మహేష్, త్రివిక్రమ్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగ వంశీ...!!

murali krishna
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్య దేవర నాగ వంశీ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ పక్క హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో రూపొందే సినిమాల నిర్మాణ పనులు చూసుకుంటూనే మరోపక్క తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు.ప్రేమమ్ , భీష్మ, రంగ్ దే, వరుడు కావలెను, డీజే టిల్లు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నాగ వంశీ ఇప్పుడు ధనుష్ తో బైలింగ్యువల్ మూవీ సార్ , బట్టబొమ్మ, అనగనగా ఒక రాజు…


ఇలా 10కి పైగా సినిమాలనే నిర్మిస్తున్నారు. ఈ లిస్ట్ లో స్వాతి ముత్యం కూడా ఉంది. బెల్లంకొండ సాయి గణేష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. అక్టోబర్ 5 న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ మహేష్ - త్రివిక్రమ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మహేష్ - త్రివిక్రమ్ మూవీ గురించి అతను మాట్లాడుతూ.. ' మహేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.


ఆ సినిమాలకు థియేటర్స్ లో దక్కాల్సిన ఆదరణ దక్కలేదు అని నా అభిప్రాయం. అవే సినిమాలు టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు జనాలు మాత్రం భీభత్సంగా చూశారు. మేము చేసే సినిమా ఆ రెండు సినిమాలను మించి ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు ఆ రెండు సినిమాలను దృష్టిలో పెట్టుకొని ధియేటర్ కు వచ్చే ప్రతి ఆడియన్ ఈ మాట చెబుతాడు ' అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చారట. అతడు సినిమాతో త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా మారారు. ఆ సినిమా కమర్షియల్ గా ఆడకపోయిన బుల్లి తెర ప్రేక్షకులను అయితే బాగా మెప్పించింది.ఆ తరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఖలేజా కూడా మంచి ఆదరణ లభించక పరాజయం పాలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: