'స్వాతిముత్యం' మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ మరియు వేదిక ఖరారు..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం మూవీ తో వెండి తెరకు పరిచయం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బోళ్లమ్మా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.
 

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. తాజాగా స్వాతిముత్యం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని మరియు వేదికను ఖరారు చేసింది. అక్టోబర్ 2 వ తేదీన సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదిక ,  మాదాపూర్ , హైదరాబాద్ లో  నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో బెల్లంకొండ గణేష్ మరియు వర్షా బొల్లమ్మ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అక్టోబర్ 5 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ టాలీవుడ్ ,  కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ లు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు భారీ మూవీ లతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: