దసరా: ఆ సినిమాలకు న్యాయం జరుగుతుందా?

Purushottham Vinay
టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సమ్మెలు టికెట్ రేట్లపై యుద్ధాలు ఇంకా అలాగే నిర్మాతల మధ్య గొడవలు అనేవి ఈమధ్య అయిపోయాయి.అయితే ఇక ఇప్పుడంతా మాట్లాడుతుంది. కొన్ని వారాలుగా వరస సినిమాలు తెగ రిలీజ్ అవుతున్నాయి.అయితే అసలైన పరీక్ష మాత్రం ఈ దసరాకే ఉండబోతుంది. నిర్మాతలు చెప్తున్నట్లు చిన్న సినిమాలకు నిజంగా న్యాయం జరుగుతుందా..?పెద్ద హీరోలు చిరు, నాగ్‌తో పోటీ పడుతున్న మంచు విష్ణు, బెల్లంకొండ గణేష్ లకు థియేటర్స్ దొరుకుతాయా..? ఇండస్ట్రీలో అంతా ఇప్పుడు దసరాకు రిలీజ్ అయ్యే సినిమాల గురించి చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే అందరి దృష్టి మాత్రం కేవలం చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ లపైనే ఉంది. అక్టోబర్ 5నే ఈ రెండు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్‌తో వస్తున్న సినిమాలు కావడం.. పైగా సీనియర్ స్టార్ హీరోలు ఉండటంతో అంతా ఈ పోరు గురించి చర్చించుకుంటున్నారు కానీ అదే రోజు మరో రెండు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. అక్టోబర్ 5నే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నాతో పాటు బెల్లంకొండ గణేష్ బాబు సినిమాలు కూడా రానున్నాయి.చిరు, నాగ్‌ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాల రేంజ్ చాలా తక్కువ. అయినా కూడా తమ కంటెంట్‌పై నమ్మకంతో స్టార్ హీరోలతో పోటీకి సిద్ధమయ్యారు ఈ ఇద్దరు హీరోలు.


అయితే ఈ సినిమాలకు సరిపడా స్క్రీన్స్ దొరుకుతాయా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న అనుమానం. స్టార్ హీరోలు బరిలో ఉన్నపుడు.. చిన్న లు తప్పుకోవడం ఎప్పట్నుంచో జరుగుతుంది. నిజానికి స్వాతిముత్యం ఆగస్టులోనే రావాల్సి ఉన్నా.. బింబిసార, సీతా రామం లాంటి సినిమాల ఉండటం వల్ల తప్పుకుంది. మరి అప్పుడే దొరకని థియేటర్స్ దసరాకు దొరుకుతాయా అనేది అనుమానమే. మరోవైపు మంచు విష్ణు సైతం జిన్నాతో వస్తున్నారు.. ఈయన పరిస్థితి కూడా అంతే. గాడ్ ఫాదర్ ను నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. పైగా అక్కడున్నది మెగాస్టార్ చిరంజీవి కాబట్టి.. థియేటర్స్ సమస్య ఉండదు. మరోవైపు ది ఘోస్ట్‌ను నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు ఏషియన్ ఫిల్మ్స్. అంటే అక్టోబర్ 5న తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లో చూసినా ఈ రెండు సినిమాలే కనిపించనున్నాయి. మరి ఇలాంటి సమయంలో సమ్మె తర్వాత స్టార్స్‌తో పోటీగా విడుదలవుతున్న చిన్న సినిమాలకు ఏ మేరకు న్యాయం జరగనుందో దసరా వస్తే తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: