చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ కి జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే మూవీ లో హీరోగా నటించాడు.

ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ,  సత్యదేవ్ ,  నయన తార కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి తార్ మార్ టక్కర్ మార్ అనే సాంగ్ ని కూడా విడుదల చేసింది. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తాజాగా మోహన్ రాజా సోషల్ మీడియా వేదికగా గాడ్ ఫాదర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినట్లు  , ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు యు / ఏ సర్టిఫికెట్ ని జారీ చేసినట్లు తెలియజేశాడు. మరి గాడ్ ఫాదర్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: